ఇటివలే సరైనోడు సినిమాతో మంచి ఫామ్ లో ఉన్నాడు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. మంచి కమర్షియల్ సినిమా తీయాలి అనుకుంటే ముందుగా ఏ హీరో అయిన బోయపాటినే ఆప్షన్గా తీసుకుంటారు. అలాంటి బోయపాటి శ్రీనుపై ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్ లో దర్శకుడు కొరటాల శివ బోయపాటి శ్రీను సింహా కథ విషయంలో తనకు అన్యాయం చేశాడని చెప్పి ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా బోయపాటికి సోదరుడు, గురువు అయిన పోసాని కృష్ణమురళి సైతం తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటిని టార్గెట్గా చేసుకుని ఫైర్ అయ్యాడు. బోయపాటికి తాను లైఫ్ ఇస్తే.. తన దగ్గరే అతను చాలా చీప్ గా బిహేవ్ చేశాడని వ్యాఖ్యానించాడు పోసాని. బోయపాటిపై తనకు ఉన్న కోపాన్ని పోసాని ఇలా వ్యక్తం చేశాడు.
ఓ సారి తన చిత్రం ప్లాప్ అయితే ఆ సినిమా గురించి మా ఆవిడతో మాట్లాడుతూ.. ‘మేమంటే దర్శకత్వ విభాగంలో పని చేశాం. కానీ అన్నయ్య చేయలేదు కదా.. అందుకే సినిమా పోయింది. మున్ముందు ఇంటికి సంబంధించిన బిల్లులు కట్టుకోవడానికి కష్టపడాలేమో కదా వదినా’’ అంటూ ఎగతాళిగా మాట్లాడాడని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన సహాయం మర్చిపోయి మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు అర్థం కావడం లేదు అన్నారు. బోయపాటికి తాను చేసిన సాయం గురించి పోసాని చెప్పిన విషయాలు ఈ వీడియోలో ఆయన మాటల్లోనే వినండి.
{youtube}YWnHVYJd39o{/youtube}
Related