Thursday, April 25, 2024
- Advertisement -

వ‌ర్మ త‌రువాత కీరవాణి

- Advertisement -

నోటీసులు అందుకున్న కీరవాణి?

ఏ మూహ‌ర్త‌నా రాంగోపాల్ వ‌ర్మ జీఎస్టీ మొద‌లు పెట్టాడో గాని వ‌రుస పెట్టి వివాదాలు వ‌స్తునే ఉన్నాయి.గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ వివాదం మరింతగా ముదురుతోంది. పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతో కలిసి వర్మ తీసిన ‘జీఎస్టీ’ గత కొంతకాలంగా నెట్టింట హల్ చల్ చేసింది.ఈ వివాదంపై హైద‌రాబాద్ పీస్‌లో వ‌ర్మ‌పై కేసు న‌మోదైంది. విచారణకు హాజరైన వర్మ వచ్చే శుక్రవారం తదుపరి విచారణకు హాజరుకావాల్సిఉంది.

ఈ కేసులో మరికొంత మందికి నోటీసులు అందించేందుకు రంగం సిద్ధం చేశారు సీసీఎస్ పోలీసులు. ‘జీఎస్టీ’ వీడియోకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్. ఎమ్. కీరవాణికి నోటీసులు అందిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈసారి విచారణకు వర్మతో పాటు సంగీత దర్శకుడు ఎమ్. ఎమ్. కీరవాణి, ఈ చిత్రానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్‌‌ని పిలిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -