Friday, May 17, 2024
- Advertisement -

అనసూయ ఎంత టాక్స్ ఎగ్గొట్టిందో తెలుసా ?

- Advertisement -

జబర్దస్త్ షో ద్వారా అనసూయ బాగా క్రేజ్ తెచ్చుకుంది. అలానే తన అందాలతో కుర్రకారును పిచ్చేక్కిస్తోంది. ఈ క్రమంలో బుల్లితెరపై మెరుస్తూనే సినిమాల్లో కూడా కీలక పాత్రలను పోషిస్తోంది. అయితే ఇటీవలే కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్ యాంకర్ల ఇళ్ళ పై జీఎస్టీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ సోదాలుపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని సుమ, అనసూయ ఇప్పటికే ఖండించారు. అనసూయ అయితే.. ‘తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ’ మీడియా వారి పై కూడా విరుచుకుపడింది. అయితే అనసూయ కేవలం 25 లక్షల టాక్స్ మాత్రమే చెల్లించిందని ఇంకా రూ.55 లక్షలు చెల్లించాల్సివుందని జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జీఎస్టీ ఇంటలిజెన్స్ హెడ్ బాలాజీ మజుందార్ ప్రముఖ ఆంగ్ల పత్రికతో ఈ విషయం పై స్పందించారు.

‘సర్వీస్ టాక్స్ విషయంలో అనసూయ రూ.35 లక్షల వరకూ చెల్లించలేదు. ఆ మొత్తానికి వడ్డీ పెరిగి మరో 15 లక్షలు అయ్యింది. ఆమె సరైన సమయానికి టాక్స్ చెల్లించకపోవడంతో పెనాలిటీతో కలిపి మొత్తం రూ.80 లక్షలు వరకూ చేరింది. ఈ మొత్తంలో ఆమె కేవలం 25 లక్షలు మాత్రమే చెల్లించింది. ఇంకా బ్యాలన్స్ అలాగే ఉంది. ఇందుకు సంబంధించి ఆమెకి నోటీసులు కూడా పంపడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడేం చేస్తుందో అనసూయ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -