పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలు ముగిసిన వెంటనే సినిమా షూటింగ్లలో బిజీ కానున్నారు పవన్. ఇక పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ప్రధానంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ఒకటి. ఇక ఇప్పటివరకు ఈసినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.
అయితే తాజాగా నిర్మాత ఏఎం రత్నం కీలక అనౌన్స్ చేశారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే పవన్ హరిహరవీరమల్లు సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారని తెలిపారు. హరి హర వీర మల్లు మూవీతో పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో పవర్ స్టార్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సినిమా 17వ శతాబ్దానికి సంబంధించిందని కొంత సమయం పడుతుందని తెలిపారు ఏఎం రత్నం. ఈ ప్రాజెక్టు అటకెక్కిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని దీనిని నమ్మోద్దన్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.