Sunday, April 28, 2024
- Advertisement -

ఇద్దరు హీరోలు బుట్టలో పడ్డారు

- Advertisement -

ఒక సమయంలో ఒక స్టార్ హీరోనే మెప్పించడం కష్టమంటే ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి తన కథలతో మెప్పించాడు టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా…ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు. ఈ ఇద్దరితో ఇంతకుముందు చెరో సినిమా చేసి పెట్టిన హరీష్ పవన్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వగా ఎన్టీఆర్ మాత్రం డిసాస్టర్ ఇచ్చాడు.

పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచింది, ఇక ఆ తరువాతే ఎన్టీఆర్ తో చేసిన రామయ్యావస్తావయ్యా ఆల్ టైం డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అప్పటి నుండి తిరిగి ఎన్టీఆర్ కి ఎలాగైనా ఓ రేంజ్ హిట్ ఇవ్వాలని ఎంతో కష్టపడి ఓ అదిరిపోయే కథని సిద్ధం చేసుకున్నాడట హరీష్ శంకర్.

ఈ మధ్యనే ఎన్టీఆర్ ని కలిసి కథ వినిపించి శెభాష్ అనిపించుకున్నాడట హరీష్. ఇక పవన్ ఈ మధ్యనే హరీష్ ని పిలిచి ఏదైనా కథ ఉంటే చెప్పు అనడంతో వెంటనే గబ్బర్ సింగ్ తరువాత పవన్ కోసం రాసుకున్న కథని వినిపించగా పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట, మరి ఇద్దరితో ముందు ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -