హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్లతో మళ్లీ వార్తల్లో నిలిచింది.తన వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తోంది. తాను ఎవరి చేతిలోనో మోసపోయాను అన్నట్లుగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా అది కూడా పరోక్షంగా తన రివేంజ్ తీర్చుకుంటోంది. ‘జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి’ అంటూ ఆమె చేసిన ట్వీట్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్ లో రెండు సినిమా పేర్లను వాడటంతో ఈ విషయం మరింత వేడెక్కింది.
ఎన్నారై హీరోయిన్ల వైపు చూసే ఓ దర్శకుడు అంటూ పూనమ్ మరో ట్వీట్ చేసింది. కేవలం నాకు హిట్ లేకపోవడం వలనే పక్కన పెట్టేశారు అంటూ కూడా వ్యాఖ్యానించింది. టాలీవుడ్ టాప్ హీరోలు అందరు ఇతనితో క్లోజ్గా ఉంటారు, దీంతో అతని చెప్పిందే వేదం అనేలా ఇక్కడ హీరోలు వ్యవహరిస్తున్నారని , ఆ దర్శకుడితో జాగ్రత్తగా ఉండలని హితువు పలికింది పూనమ్.అయితే పూనమ్ చేసిన కామెంట్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ను ఉద్దేశించి చేసినవే అని కొందరు అనుకుంటున్నారు.పవన్తో చేసిన జాల్సా,అజ్ఞాతవాసి సినిమా పేర్లును తన ట్వీట్టర్లో రాయడాన్ని బట్టి చూస్తే ఈ వాఖ్యలు త్రివిక్రమ్పైనే అని కొందరి వాదన.
పూనమ్ గతంలో పవన్తో సన్నిహిత్యంగా ఉండేదని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇది త్రివిక్రమ్కు నచ్చక,పవన్ను పూనమ్ నుండి దూరం చేశాడని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.అది మనస్సులో పెట్టుకుని పూనమ్ తన ట్వీట్టర్ ద్వారా తన అక్కసును త్రివిక్రమ్పై తీర్చుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.మరి ఈ వాఖ్యలు త్రివిక్రమ్ను ఉద్దేశించి చేసినవి అవునో కాదో పూనమే చెప్పాలి.
https://twitter.com/poonamkaurlal/status/999688853433679872
The director yet extends his support to thru all his 4 families support to this so called NRI heroine ( he has tendendancy to fall for this particular slang for years ) so I did not have a hit …so did she ??#justasking …good at quite a few jobs u give #justheard #hypocrisy
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 24, 2018