బుల్లితరపై న్యూస్ రీడర్గా కెరియర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్.. అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ టీవీలో జబర్ధస్త్ ఖతర్నాక్ కమెడీ షో అంటూ మరింత పాపులారిటీని సోంతం చేసుకుంది. ఇక అప్పుడప్పుడు తన అందచందాలతో హాట్ షోతో ఎనలేని క్రేజ్ సంపాదించుకంది ఈ ముద్దుగుమ్మ.
అయితే, బుల్లితెరపై కొత్తవరవడిని సృష్టించిన ఈ అమ్మడికి వెండితెర అవకాశాలు సైతం వెతుక్కుంటూ వచ్చాయి. ఆ మధ్య రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్రలో ఓ రేంజ్ లో నటించి విమర్శలకు నుంచి సైతం ప్రశంసలు పొందగలిగింది. ఎంతలా అంటే అనసూయ అంటే గుర్తు పడతారో లేదో తెలియదు కానీ తెలుగు నాట రంగమ్మత్త అంటే గుర్తుపట్టేలా అనసూయ నటించింది.
ప్రస్తుతం వివిధ టీవి షోలు, సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న ఈ అమ్మడు త్వరలోనే రాజకీయాల్లోకి సైతం అడుతుపెట్టబోతున్నదట. అనసూయ రాజకీయ అరంగ్రేటం చేయడానికి ముహుర్తం సైతం ఖరారైనట్టు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. జబర్ధస్త్ కామెడీ షో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రోజా గైడెన్స్ తోనే అనసూయ పొలిటికల్ ఎంట్రీ చేస్తున్నదని సినీ వర్గాల్లోటాక్ నడుస్తోంది. ఇదే గనక నిజమైతే ఆమె ఏ పార్టీలో చేరుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా..!
కృతి శెట్టి గురించి మీకు తెలియని విషయం ఇది!
వంటలక్కకు ఎసరుపెడుతున్న మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?