Friday, April 26, 2024
- Advertisement -

అఖిల్‌కు పూజా హెగ్దే విసిరిన గులాబి బాణం చూశారా?

- Advertisement -

భార‌తీయ సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి పూజా హెగ్దే. ఇటీవ‌ల అల్లు అర్జున్‌తో అల వైకుంఠ‌పురంలో రోమాన్స్ చేసిన ఈ బుట్ట‌బొమ్మ తాజాగా యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు గులాబి బాణం విసిరింది. ఈ గులాబి బాణం మాములుగా లేదు. వాలంటైన్స్ డే న విసిరింది కాబ‌ట్టే అంత‌ ప్ర‌త్యేకం.

మ‌రీ అందాల బుట్ట‌బొమ్మ విసిరిన ఆ గులాబి బాణానికి.. పూజా హెగ్దే సోయ‌గాల‌ను చూసి అఖిల్ ఫిదా అయిపోయాడు. ఆమే అందచందాల‌ను.. చిరున‌వ్వుతో.. తీయ్య‌నైనా మాట‌ల‌ను వింటూ ఆమె అలానే చూస్తూ మైమ‌ర‌చి పోయాడు. ఈ అంద‌మైన దృశ్యం ఎక్క‌డో జ‌రిగింద‌బ్బా అనుకుంటున్నారా? అదే నండి వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ లో..

ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింది. ఈ సినిమాకు గోపీ సుంద‌ర్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్రేమికుల రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ‘అరె గుచ్చే గులాబిలాగా నాగుండె లోతునే తాకినదే.. వెలుగిచ్చే మతాబిలాగా నా రెండు కళ్ళలో నిండినదే..’ అంటూ సాగే ఓ పాట‌ను విడుద‌ల చేశారు. సీని ప్రేక్ష‌కుల‌ను ఇది తెగ అకట్టుకుంటోంది. మరీ మీరు కూడా చూసేయండి మరి.. !

నారింజ పండ్ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా?

ప్రేమికుల రోజు కథేంటో తెలుసా? ఫిబ్ర‌వ‌రి 14 నే ఎందుకు ?

‘ధూమ్’ సీక్వెల్ లో దుమ్ములేప‌నున్నదీపిక !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -