Friday, May 24, 2024
- Advertisement -

పవన్, మహేష్.. మధ్యలో ఎన్టీఆర్

- Advertisement -

టాలీవుడ్ లో ఎవరు నంబర్ వన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణా? ప్రిన్స్ మహేష్ బాబా? చాలా కాలంగా ఈ ప్రశ్న.. తెలుగు సినీ అభిమానుల్ని వెంబడిస్తోంది. ఈ విషయంలో పవన్, మహేష్ ఫ్యాన్స్ మధ్య కూడా డిబేడ్ నడుస్తోంది. తమ హీరో బెస్ట్ అంటే.. తమ హీరో ద బెస్ట్ అంటూ.. అందుకు కారణాలు కూడా చెబుతూ.. ఫ్యాన్స్ హడావిడి కూడా కామనైపోయింది.

అయితే.. వీరిద్దరి మధ్యలో సైలెంట్ గా వచ్చేసేందుకు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. టెంపర్, నాన్నకు ప్రేమతో.. ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా ట్రాక్ లోకి వచ్చేసిన జూనియర్.. అదే స్పీడ్ ను అదే ఊపును కంటిన్యూ చేస్తూ.. మళ్లీ సింహాద్రి సినిమా టైమ్ లో తనకు ఉన్న స్టార్ డమ్ తను సంపాదించుకునే పనిలో పడ్డాడని తెలుస్తోంది.

ఇంత హడావిడి మధ్య వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు.. ఏ మాత్రం తేడా కొట్టినా.. ఆ గ్యాప్ లో జనతా గ్యారేజ్ ను వదలాలి.. ఇద్దరి కంటే ఇండస్ట్రీలో అప్పర్ హ్యాండ్ కొట్టేయాలి అన్నదే.. యంగ్ టైగర్ టార్గెట్ అని వినిపిస్తోంది.

సక్సెస్ టెంపో ఎక్కడా మిస్ కాకుండా.. జనతా గ్యారేజ్ సినిమాను ఎన్టీఆర్ ఎంపిక చేసుకున్న విధానమే అందుకు ఉదాహరణగా ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మ్యూజిక్ నుంచి స్టోరీ వరకు.. యాక్షన్ నుంచి డాన్స్ వరకూ.. తనదైన స్టైల్ ను.. జనతా గ్యారేజ్ సినిమాతో చూపించేందుకు పక్కాగా ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కూడా అప్పుడే హంగామా మొదలు పెట్టేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -