- Advertisement -
భారతీయ సినీ ఇండస్ట్రీలో సంచలనం కాంతార. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా తెరకెక్కినీ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది . నవంబర్ 27న ముహూర్త కార్యక్రమాలతో సీక్వెల్ పార్ట్ ప్రారంభంకానుండగా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. ఈ సినిమా సెటప్ 300-400 ఎడి సమయంలో ఉంటుందట.
ఇక ఫస్ట్ పార్టును లో బడ్జెట్తో తెరకెక్కించగా సెకండ్ పార్టుని మాత్రం 100 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ లుక్ లోకి మారగా అది వైరల్గా మారింది.