Saturday, May 4, 2024
- Advertisement -

కూతుర్ని చంపిన తల్లి.. హీరోయిన్ రాయ్ లక్ష్మి సంచలనం..!

- Advertisement -

హీరోయిన్, మోడల్ రాయ్ లక్ష్మీ.. ఇంపార్టేన్స్ ఉన్న పాత్రలకంటే అందాల అరబోస్తూ కుర్రకారును రెచ్చగొట్టిన పాత్రలే ఎక్కువగా చేసింది. కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత పెద్దగా ఛాన్స్ లు రాకపోవడంతో కోలీవుడ్ చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ లు రాకపోవడంతో ఆమె తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకుంది. తర్వాత మళ్లీ కోలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయింది. కొన్ని చిత్రల్లో అందలు అరబోసింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటం సాంగ్స్ కూడా చేసింది. విలన్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 2015లో ముంబైలో వెలుగులోకి వచ్చిన షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం రేపింది.

కూతురు షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియే 2012లో హత్య చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంచలనం రేపిన ఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు స్వరాజ్ సినిమా కథను సిద్దం చేసుకున్నాడు. ఈ చిత్రంలో ఇంద్రాణీ పాత్రలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ నటిస్తోంది. ఇలాంటి పాత్ర చేయడం చాలెంజ్ గా ఉందని రాయ్ లక్ష్మీ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -