రాఘవేంద్రారావు దర్శకత్వంలో నాగార్జున ఓం నమో వెంకటేశాయలో హతీరాం బాబాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్.. ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది-2లో నటిస్తున్నాడు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.
నాగ్-రాగ్-ఆఫ్టర్ ఏ ఫ్లాప్ అన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయింది. ఈ ఫార్ములా ప్రకారం నాగార్జున, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన భక్తి సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చిన నాగ్ సినిమా ఫట్ అవుతుంది. అన్నమయ్య తర్వాత వచ్చిన చంద్రలేఖ, ఆటో డ్రైవర్ అడ్రస్ లేకుండా పోతే శ్రీ రామదాసు తర్వాత వచ్చిన బాస్.. షేక్ అయిపోయాడు.
ఇక శిరిడీ సాయి తర్వాత వచ్చిన ఢమరుకం, గ్రీకు వీరుడు కూడా యావరేజ్ గా నిలిచాయి. ఈ ఫార్ములాని బట్టి చూస్తే ఓం నమో వేంకటేశాయ తర్వాత నాగ్ చేయబోయే సినిమా రాజు గారి గది-2నే. అయితే పీవీపీ లాంటి పెద్ద సంస్థ ఓంకార్తో సినిమాకు సిద్ధమయ్యిందంటే కధ బాగుండి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఓంకారన్నయ్య.. నాగ్, సమంతలతో తెరకెక్కించనున్న ఈ సినిమా ఆడితే ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్ పోయినట్లేగా.. మరి ఓంకారన్నయ్య ఏం చేస్తాడో చూడాలి.