మెగా ఫ్యామిలీకి పరిశ్రమలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి ఎంతో కష్టపడి మెగా ఫ్యామిలీ ని నిలబెట్టిన సంగతి తెలిసిందే. అయితే మెగా ఫ్యామీలీ మీద ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తునే ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీలో ఎలాంటి రూమర్స్ వచ్చినా.. ఎవరు పట్టించుకోరు కానీ.. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం వెంటనే ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తారు.
మెగా ఫ్యామిలీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన.. వారికి కౌంటర్ ఇచ్చేస్తారు. ఎవరు ఏమన్నా.. తాను చెప్పాలనుకున్నది ముక్కు సూటిగా చెప్పేస్తారు. ఇలాంటి సందర్భాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ ఆ మధ్య మెగా ఫ్యామిలీ లో సాయిధరమ్ తేజ్ .. నిహారిక ల మధ్య ఏవో రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇద్దరు ఇష్టపడ్డారని.. పెళ్లి చేసుకుంటున్నారని.. రకరకల రూమర్స్ వచ్చాయి. ఈ విషయం మీడ నాగబాబు చాలా సీరియస్ అయ్యారు.
అలాంటి వార్తలు అన్ని రూమర్స్ అని.. అదొక ఫూలిష్ న్యూస్ అని కొట్టి పడేశారు. ఏ దరిద్రుడో ఆ వార్తను క్రియేట్ చేసి వుంటాడని చెప్పారు. సాయిధరమ్ తేజ్, నిహారిక వాళ్లిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెళ్ల మాదిరిగా పెరిగారని అన్నారు. పనీపాటా లేని వాళ్లు సృష్టించే ఇలాంటి రూమర్స్ ని నమ్మవద్దని నాగబాబు క్లారిటీ ఇచ్చారు.