Sunday, April 28, 2024
- Advertisement -

డ్రగ్స్ కేసు…ఎక్కడికి పారిపోలేదంటున్న హీరో!

- Advertisement -

డ్రగ్స్ కేసు…ఈ పేరు వింటేనే వణికిపోతున్నారు సినీరంగానికి చెందిన ప్రముఖులు. బాలీవుడ్,టాలీవుడ్,కోలీవుడ్ అనే తేడా లేదు. బడా బడా స్టార్ హీరోలతో పాటు వారి తనయులకు కూడా డ్రగ్స్‌ మరకలు అంటాయి. ఇక ప్రముఖంగా టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురి విచారణ కూడా జరిగింది. ఇక డ్రగ్స్ కేసులో ఎప్పుడు ఏ అంశం వెలుగులోకి వచ్చినా దానిలో సినీ ప్రముఖుల హస్తం ఉంటుంది. తాజాగా మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవదీప్ పరారీలో ఉన్నారని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో వెంటనే స్పందించిన నవదీప్ ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు. తానెక్కడి పారిపోలేదని హైదరాబాద్‌లోనే ఉన్నానని తెలిపారు. తనపై కొంతమంది ఇచ్చిన తప్పుడు ప్రచారం ఆధారంగా పోలీసులు నోటీసులు ఇచ్చారని కానీ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నవదీప్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్రాగా త్వరలోనే సీజన్ 2 కూడా రాబోతోంది.

ఇక మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ ఫైనాన్షియర్‌ కె.వెంకటరమణారెడ్డితో పాటు దర్శకుడు సుశాంత్‌ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్‌ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్‌ కుమారుడు సురేష్ రావు, ఇంద్రతేజ్, కార్తీక్‌తో పాటు పలువురి పేర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తోపాటు కలహర్‌ రెడ్డి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -