Tuesday, May 21, 2024
- Advertisement -

చివరిలో ఎన్టీఆర్ ను చంపేది.. వాళ్లిదరేనట..?

- Advertisement -

తెలుగులో క్లైమాక్స్ ను తీయడం చాలా కష్టం.. ఎందుకంటే.. ఈ క్లైమాక్స్ విషయంలో పెద్ద డైరెక్టర్లు కూడా స్పెషల్ కేర్ తీసుకుంతారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవ కుశ మూవీ విషయంలో అలాంటే ఆసక్తి అందరిలో కలుగుతోంది. జై లవ కుశ మూవీలో.. ఎన్టీఆర్.. జై.. లవ.. కుశ అనే మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే జై పాత్రకు సంబంధించి టీజర్ ను రిలీజ్ చేశారు. జై రోల్ లో భయంకరమైన విలన్ గా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. కానీ కథ ప్రకారం.. ఈ పాత్రను క్లైమాక్స్ లో చంపేయాల్సి వస్తుందట. అది కూడా లవ.. కుశ.. రెండు పాత్రలు కలిసి సినిమా చివరిలో జై పాత్రను చంపేస్తారట. చంపే పాత్రలను కూడా ఎన్టీఆరే పోషిస్తున్నా.. చనిపోయే పాత్ర గురించే గురించి ఆలోచించాలి. ఆన్ స్క్రీన్ పై జై రోల్ ను చంపేసినా.. ఫ్యాన్స్ మాత్రం అక్కడ ఎన్టీఆర్ నే చూసుకుంటారు. తమ హీరో స్క్రీన్ పై చనిపోవడం అనే పాయింత్ ను వారు ఎలా రిసీవ్ చేసుకుంతారన్నదే అసలైన విషయం. విలన్ పాత్రను ఎన్టీఆర్ పోషించినా సరే.. రోల్ ను నిర్దాక్షిణ్యంగా చంపేయడం అనేది.. తెలుగు సినిమా పడికట్టు రూల్. మరి జై లవ కుశ విషయంలో కూడా దీన్నే ఫాలో అవుతారా.. లేక అభిమానులను దృష్టిలో పెట్టుకొని.. క్లైమాక్స్ ను కొత్తగా తీస్తారా అనేది తెలియాలంటే మూవీ వచ్చేవరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -