పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. స్టార్ హోదా ఉన్నప్పటికి ఆయన ప్రయత్నిస్తున్న తీరు చూసి రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. అయితే రాజకీయల్లో పాజిటివ్ కామెంట్స్ వచ్చిన మాదిరిగానే.. నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి.
వాటిని తట్టుకొని ఎదురు నిలబడే శక్తి ఉండాలి. ప్రతి నాయకుడు చేసే కామెంట్స్ కి సమాధానం చెప్పే సత్తా ఉండాలి. అయితే తాజాగా పవన్ సోషల్ మీడియా టీమ్ తో నిర్వహించిన సమావేశంలో అనేక విషయాలను గురించి చెప్పారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు పోటీని ఇస్తామన్నది తాను కూడా కరెక్ట్ గా చెప్పాలేనని అన్నారు. అలానే అధికారమే ముఖ్య లక్ష్యం కాదని పవన్ ప్రస్తావించారు. రాజకీయాల్లో ఎలాంటి కుట్రలు పన్నుతారో తనకు తెలుసనీ అందరికి నచ్చకపోవచ్చని కానీ ఒకరు విమర్శిస్తే సహనం ఓ స్థాయి వరకే ఉంటుందని పవన్ చెప్పాడు.
ఇక ఎవరు తన మీద కామెంట్ చేసినా భరిస్తానని పవన్ ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అయితే కొన్ని వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రాజకీయ పరంగా ఆయనపై కొందరిని కావాలని ఉసిగొలుపుతున్నారని పవన్ ఫ్యాన్స్ ని మొదట టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ అనవసరంగా తనపై ద్రుష్టి పెడితే వారికి ఉపయోగం ఉండదని పవన్ తెలిపారు. మహేష్ కత్తి కి పేరు చెప్పకుండా కౌంటర్ వేశారు పవన్ కళ్యాణ్