Sunday, May 5, 2024
- Advertisement -

ఫిదా మూవీ చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా..?

- Advertisement -

ఫిదా మూవీ.. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్న ఒక్కటే మాట ఫిదా ఫిదా. ఇప్పటికే ఈ సినిమాని చూసి చాలా మంది ఫిదా అయిపోయారు. అలానే సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా చూసి.. ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాకుండా తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్, అలానే మంత్రి కేటీఆర్ కూడా ఈ సినిమా చూసి.. అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

అయితే ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి మంచి క్రేజ్ వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్, హీరోయిన్ గా సాయి పల్లవి నటించగా.. వరస హిట్ సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. అందరికంటే ఈ సినిమాలో భానుమతి పాత్ర చేసిన సాయి పల్లవికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫిదా గురించి మాట్లాడుకుంటే.. ఖచ్చితంగా సాయి పల్లవి నటన గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇటివలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఫిదా మూవీ చూసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఫిదా చూసిన పవన్.. ముందుగా శేఖర్ కమ్ములను ప్రశంసించినట్లు తెలుస్తోంది. శేఖర్ సినిమా అద్భుతంగా తీసారని అన్నట్లు తెలుస్తోంది.

అలానే వరుణ్ చాలా సీన్స్ లో బాగా చేశారని.. ఎమోషన్ సీన్స్ లో బాగా చేశారని మెచ్చుకున్నాడట. ఇక భానుమతి పాత్ర చేసిన సాయి పల్లవి నటన చూసి.. చాలా బాగా చేసిందని.. ఆమె ఖచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని.. అన్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని అన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన.. ఫిదా మూవీ చూసి పవన్ స్పందించడం నిజంగా విశేషమే.

https://www.youtube.com/watch?v=T_dGt5y9Iv0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -