Thursday, May 16, 2024
- Advertisement -

మరో షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీసి పెద్ద షాకిచ్చాడు పవర్ స్టార్. ఎందుకంటే ఈ చిత్రం భారీ హిట్ సాధిస్తుందనుకుంటే ప్లాప్ గా నిలిచింది. గతంలో కూడా పవన్ జానీ చిత్రం తీసి షాక్ ఇచ్చాడు. అయితే ఈ షాక్ లు సర్దార్ రిలీజ్ కు ముందునుంచే మొదలయ్యాయి. మొదట సంపత్ నందిని దర్శకుడిగా తీసుకోని ఆ తర్వాత అతని ప్లేస్ లోకి బాబీని దింపాడు.

అనీషా అంబ్రోస్ అనే హీరోయిన్ మొదట తీసుకున్న ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి కాజల్ ను తీసుకొచ్చాడు. ఇక కథలో కూడా చాలా మార్పులు చేసాడట. మొత్తానికి సర్దర్ సినిమాకి సంబంధించి పవన్ చాలా షాకులు ఇచ్చాడు. ఇప్పుడు మరో సారి పవన్ అలాంటి షాక్ నే రిపీట్ చేయాలని పవన్ భావిస్తున్నాడు. సర్దార్ తర్వాత పవన్ చేయనున్న సినిమాకు సంబంధించి ఇలాంటి షాక్ లు మొదలైయ్యాయి.

సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుంది అనుకున్న సమయంలో దర్శకుడు మారిపోయాడు. ఎస్ జే సూర్య తప్పుకున్నాడు. అతని స్థానంలోకి డాలీని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ విషయంపై ఇంక సరిగ్గ క్లారిటీ రాలేదు. తాజాగా హీరోయిన్ రీప్లేస్ మెంట్ అంశం తెరపైకి వచ్చింది. మొన్నటివరకు శృతిహాసన్ హీరోయిన్ అన్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో మరో కొత్త భామని తీసుకోవాలి అని చూస్తున్నారట. ఇది చాలదన్నట్టు ఎస్ జే సూర్య చెప్పి వెళ్లిపోయిన ఫ్యాక్షన్ స్టోరీని కూడా మార్చాలని చూస్తున్నారట. ఇవన్నీ చూస్తే పవన్ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టేలాగే కనిపిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -