Friday, April 26, 2024
- Advertisement -

ఖుషీ రీమేక్.. నిజమేనా?

- Advertisement -

సినిమాలకు సంబంధించినంత వరకూ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే. పవర్ స్టార్ కొత్త సినిమా మొదలు పెడుతున్నాడంటే.. డైరెక్టర్ ఎవరు.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.. హీరోయిన్ ఎవరు.. స్టోరీ లైన్ ఏంటి.. ఇలా ప్రతి విషయంలోనూ ఆసక్తి చూపే వాళ్లు ఫ్యాన్స్ కు అతీతంగా ఉన్నారు. అలాంటిది.. ఖుషీ లాంటి ఆల్ టైమ్ మెమరబుల్ ట్రెండ్ సెట్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఎస్ జే సూర్యతో.. పవన్ మళ్లీ సినిమా చేస్తున్నాడంటే.. ఆ వార్త మామూలుగా ఉంటుందా?

అది కూడా ఖుషీకి సీక్వెల్ గా తెరకెక్కుతోందన్న న్యూస్ అయితే.. ఇంకేమన్నా ఉందా?ఇంకా విషయమే కన్ఫమ్ కాలేదు. ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. కానీ.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గాసిప్ మొదలవడంతో.. ఫ్యాన్స్ లో హంగామా మొదలైంది. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ పెంచుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్.. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారన్న కామెంట్లు వినిపించాయి.

అందుకు తగ్గట్టే పవన్ వ్యవహార శైలి కూడా కనిపించింది. కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో స్పీడ్ పెంచిన పవన్.. త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఇప్పుడు.. ఎస్ జే సూర్యకూ ఓ సినిమా చేద్దామని కమిట్ మెంట్ ఇచ్చాడని ఇండస్ట్రీ టాక్. తను చెప్పిన లైన్ నచ్చడంతో డెవలప్ చేయమని.. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సూర్య ఆల్రెడీ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టేశాడని తెలుస్తోంది.

అది కూడా ఖుషీకి సీక్వెల్ గా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. పవన్ కాంపౌండ్ నుంచో.. ఎస్ జే సూర్య సర్కిల్స్ నుంచో క్లారిటీ వస్తే తప్ప.. ఈ విషయంలో క్లారిటీ రాదు. కానీ.. సినిమాల్లో పవన్ స్పీడ్ పెంచడంతో.. మళ్లీ తమ హీరోకు మునుపటి ఫామ్ రావడం ఖాయమని.. మిగతా సో కాల్డ్ స్టార్స్ అంతా సైడైపోవాల్సిందేనని పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -