Tuesday, April 30, 2024
- Advertisement -

ముంబైకి మకాం మార్చిన పూజా!

- Advertisement -

పూజా హెగ్డే..టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన మకాంను టీ టౌన్‌ నుండి బీ టౌన్‌కు మార్చింది.

ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు ఉండగా ఇటీవలే ముంబైలో ఓ ఇళ్లు కొన్నట్లు సమాచారం. సినీ సెలట్రెటీలు ఉండే బాంద్రాలో తాజాగా మరో ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఆల్రెడీ పూజాకు ఓ అపార్ట్‌మెంట్ ఉంది. సముద్రం ఫేసింగ్ ఉండేలా 45 కోట్లు ఖర్చుపెట్టి ఇల్లు కొనుక్కున్నారు.

హీరోయిన్ చేతిలో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా 45 కోట్లు పెట్టి ముంబై బాంద్రాలో ఇల్లు కొనడం బాలీవుడ్ లో చర్చగా మరింది. ఇక ఇటీవల మహేష్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో తొలుత పూజా హెగ్డేని తీసుకున్న తర్వాత ఆమె డ్రాప్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -