- Advertisement -

చెన్నైను మిస్ అవుతున్నా!

- Advertisement -

చెన్నైలో జన్మించి, అక్కడే చదువుకుని తర్వాత హైదరాబాద్‌కు మారిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చెన్నైపై తనకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. సంతోష్ శోభన్, మానసా వారణాసి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు చిత్రం కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ చెన్నై గురించి అడగగా..నేను అక్కడే పుట్టాను. చెన్నైలోని డాన్ బోస్కో స్కూల్‌లో చదివాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తమిళం మరిచిపోయాను. కానీ రాజు మాస్టర్, ప్రభు మాస్టర్ వంటి స్నేహితులతో మాట్లాడుతుండటంతో నా తమిళం మళ్లీ మెరుగైంది అని ప్రభాస్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా చాలా మంది తమిళ టెక్నీషియన్లు ఉన్నారని చెప్పారు.

ఇప్పటికీ చెన్నైకు వెళ్లినప్పుడు డాన్ బోస్కో స్కూల్ చూస్తాను. కొన్నిసార్లు చెన్నై చాలా మిస్ అవుతుంది. స్కూల్ రోజుల్లో సరైన తమిళంలో మాట్లాడేవాడిని. ఇప్పుడు కొన్ని పదాలు మరిచిపోతుంటాను అని ఆయన అన్నారు.

‘కపుల్ ఫ్రెండ్లీ’ కథ చెన్నై నేపథ్యంతో సాగుతుంది. మిత్ర (మనసా వరణాసి) శివ (సంతోష్ శోభన్)తో కలిసి ఉండడం, తర్వాత ప్రేమలో పడటం, పెళ్లి విషయంపై వచ్చే మలుపులు కథాంశం. చిత్రాన్ని అజయ్ కుమార్ రాజు నిర్మించగా, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. సంగీతం ఆదిత్య రవీంద్రన్ అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -