Tuesday, May 21, 2024
- Advertisement -

మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్!

- Advertisement -

బ్రూస్ లీ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏ సినిమా చేస్తాడు అని అనుకున్నారంతా. ఐతే తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమాని తెలుగులో రామ్ చరణ్ రీమేక్ చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. కాక పోతే అధికారికంగా మాత్రం ఈ సినిమా గురించి తెలపాలేదు.

ఇప్పుడు వీటన్నింటీకి సమాధానంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‍లో రామ్ చరణ్ హీరోగా తని ఒరువన్ తెలుగులో రీమేక్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి పూజ కార్యక్రమాల కూడా ప్రారంభించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‍లో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో సారి ఇదే బ్యానర్‍లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. సో ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు మెగా అభిమానులు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22న ప్రారంభిస్తాం అని దర్శకుడు సురేందర్ రెడ్డి తెలిపారు. మరో సారి రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్‍గా నటిస్తుంది. అరవింద్ స్వామి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక సినిమాకి ధ్రువ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -