Sunday, May 19, 2024
- Advertisement -

బాబాయ్ కోసం రంగ‌స్థ‌లం విడుద‌ల వాయిదా .. సంక్రాంతికి రానున్న ‘అజ్ఞాతవాసి’

- Advertisement -

త‌న బాబాయ్ కోసం రాంచ‌ర‌ణ్ త్యాగం చేశారు. త‌న‌కు బాబాయ్‌కి మ‌ధ్య పోటీ వ‌ద్ద‌ని భావిస్తూ త‌న సినిమాను వాయిదా వేసుకున్నారని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఆ విష‌య‌మేమిటంటే.. సినిమా వాళ్ల‌కు సంక్రాంతి పండుగ నిజంగా పండ‌గే.

ఈ స‌మ‌యంలో త‌మ సినిమాలు విడుద‌ల చేసుకోవ‌డానికి అంద‌రూ తెగ ప్ర‌య‌త్నాలు చేస్తారు. గ‌త సంక్రాంతికి సినిమా సినిమాకు తీవ్ర పోటీ నెల‌కొంది. ఇక ముచ్చ‌టేమంటే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత హీరోయిన్‌గా రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్నసినిమా ‘రంగ‌స్థ‌లం-1985. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి సిద్ధం చేయాలని నిర్మాతలు భావించారు. ఈ మేరకు డిసెంబర్ మొదటి వారానికే తొలి కాపీని సిద్ధం చేసి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించాలని అనుకున్నారు.

ఈ సంక్రాంతి సీజన్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదల చేయ‌డానికి సిద్ధమవుతోంది. ఈ స‌మ‌యంలో బాబాయ్‌కు పోటీగా ఎందుకు ఉండ‌డం అని వెన‌క్కు త‌గ్గిన‌ట్లు స‌మాచారం. ఫిబ్రవరి చివరి వారానికి చిత్రం విడుదల చేసుకోవాలని రాంచరణ్ నిర్ణయించుకున్నాడని సినీ ఇండస్ట్రీ సమాచారం. ఈ చిత్రంలో రాంచరణ్, గుబురు గడ్డంతో న్యూలుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్ర విశేషాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రాంచ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాడు. ఇదే కాక‌ ఫిబ్రవరి వరకు త‌న తండ్రి చిరంజీవి ‘సైరాస సినిమా నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకోవడానికి కూడా స‌మ‌యం కావాల్సి ఉండ‌డంతో చరణ్ సినిమాను ఆల‌స్యం చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -