Sunday, May 5, 2024
- Advertisement -

‘రంగ‌స్థ‌లం’ అధ్య‌క్షుడి గుర్తు ‘లాంత‌రు’.. ఓటేయండే

- Advertisement -

గ్రామీణ నేప‌థ్యంలో రూపొందుతున్న సినిమా ‘రంగ‌స్థ‌లం’. ఈ సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ పనులు కొన‌సాగుతున్నాయి. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ తేజ్ వైవిధ్య‌భ‌రిత సినిమా ‘రంగ‌స్థ‌లం’ చేస్తున్నారు.

ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్ సూప‌ర్‌గా ఉండ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. గ్రామీణ నేప‌థ్యంలో పీరియాడిక్ ఫిల్మ్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆది పాత్ర పోస్ట‌ర్ ఒక‌టి బ‌య‌ట‌కు విడుద‌లైంది. ఆది పినిశెట్టి రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

‘రంగ‌స్థ‌లం’ గ్రామ అధ్య‌క్షుడిగా పోటీ చేసే అభ్య‌ర్థిగా ఉన్న ఆది ఫొటో ఆక‌ట్టుకుంటోంది. అప్ప‌టి హెయిర్‌స్టైల్‌, క‌ళ్ల‌జోడుతో ఆది ఉన్నాడు. ‘రంగ‌స్థ‌లం గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో గ్రామ ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా గ్రామ ప్ర‌జ‌లు బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థి కె.కుమార్‌బాబును లాంత‌రు గుర్తుకే ఓటు ముద్ర వేసి గెలిపించండి. ఆది ఫొటో కింద కింద పోటీ చేసే అభ్య‌ర్థి కె.కుమార్ లాంత‌రు గుర్తుకే మీ ఓటు అని రాసి ఉన్న ఎన్నిక‌ల ప్ర‌చార పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఆనాటి పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తూ ఆది పాత్ర ఉండేట్టు క‌నిపిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్, స‌మంత‌ బ‌ధిరులుగా క‌నిపిస్తున్నారు. చ‌ర‌ణ్‌కు సోద‌రుడిగా ఆది న‌టిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 30వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -