Sunday, April 28, 2024
- Advertisement -

పవన్‌పై ఆర్జీవీ మార్క్ ర్యాగింగ్!

- Advertisement -

టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ ఏమో గాని పవన్ కళ్యాణ్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. 175 స్థానాల్లో కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకుని పవన్ తన పార్టీని టీడీపీకి అమ్ముకున్నాడని ఆ పార్టీ నేతలే మండిపడుతున్నారు. తాజాగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ…జనసేనాని పవన్‌పై మాస్ ర్యాగింగ్ చేశారు.

జనసేనకు 23 సీట్లు ఇస్తే, అది టీడీపీ లక్కీ నెంబర్ అంటారు. అదే 25 సీట్లు ఇస్తే పవన్‌ను పావలా సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేస్తారని చెప్పుకొచ్చారు ఆర్జీవీ. అందుకే మధ్యే మార్గంలో 24 సీట్లు ఇచ్చారు కావొచ్చని చురకలు అంటించారు.

ఇక 3 ఎంపీ స్థానాలు ఇచ్చారని పవన్ మాట్లాడిన క్లిప్‌ను జత చేసిన ఆర్జీవీ.. రెండు లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానంతో పవన్ అద్భుత లాజిక్ తీశారని మాస్ ర్యాగింగ్ చేశారు. ఒక వేళ మూడు పార్లమెంటు స్థానాల పరిధిలోని ఏడు చొప్పున నసేన 45 స్థానాలలో పోటీ చేస్తే… టీడీపీ 303 స్థానాల్లో పోటీ చేస్తుందా..ఇదేం లాజిక్ అర్థం కాలేదన్నారు. ఈ రోజు పీకే కోసం బాధపడినంతగా తాను ఎవరికోసం బాధపడలేదన్నారు. 24 గంటలుప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పడానికే 24 సీట్లు తీసుకున్నామని చెప్పేందుకు పవన్ ఇలా చేసి ఉంటారేమో అన్నారు. చెప్పే మీమ్‌ను ఆయన 25వ తేదీన ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -