ఈ వార్త తో దేశ రాజధాని నగరం లోని గుర్గావ్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది, తమ ఇళ్ళ మధ్యలో ఉంటూ ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అని తెలుసుకున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్య పోతున్నారు.
నేపాల్ కి చెందిన ఇద్దరు మహిళలని తమ ఇళ్ళలో బంధించి వారిని రోజుకు లెక్కలేనన్ని సార్లు అత్యాచారం చేసి హింసకు గురి చెయ్యడం తో ఈ సంఘటన పోలీసుల వరకూ వెళ్ళింది. దాంతో పోలీసులు రంగం లోకి దిగి వారిని కాపాడారు. హౌస్ కీపింగ్ కోసం నేపాల్ నుంచి ఇద్దరు మహిళలు ఆరునెలల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు వారు అనుకున్న ఒక హోటల్ లో పని దొరకడం తో రెండు నెలలు అక్కడే పని చేసారు తరవాత ఆ ఇద్దరినీ సౌదీ దౌత్య వేత్తకి భారతదేశం లో ఉన్న నివాసానికి ట్రాన్స్ఫర్ చేసారు.
ఇక్కడికి వచ్చి సౌదీ దౌత్యవేత్త నివాసం లో ఉంటున్న వారిని దారుణంగా హింసించి రోజూ పది పదిహేను సార్లు అత్యాచారం చేస్తూ ఉన్నారు. తిండి కూడా పెట్టకుండా రోజూ వారిని కొడుతూ ఉండేవారు అని ఆ ఆడపిల్లలు చెబుతున్నారు. ఇలాంటి మరొక మహిళ అక్కడనుంచి తప్పించుకుని మైతేయి ఇండియా అనే స్వచ్చంద సంస్థ కి సమాచారం ఇవ్వగా వారు పోలీసుల సహాయం తో వీరిని బయటకి తీసుకుని వచ్చారు.