Friday, April 19, 2024
- Advertisement -

మూడు పెళ్లిళ్లు చేసుకుంటారో వాళ్ళను ఎన్‌కౌంటర్‌ చేయాలి : శ్రీరెడ్డి

- Advertisement -

దిశా నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సందర్బంగా శ్రీ రెడ్డి స్పందించింది. ఛాన్స్ దొరికింది కదా అని ఏకంగా ఓ స్టార్ హీరోపై కామెంట్స్ చేసింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేశారు. దీంతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు పలువురు సెలబ్రిటీలు సైతం తెలంగాణ పోలీసుల చేసిన ఎన్‌కౌంటర్‌‌ని సమర్థిస్తూ నిందితులకు సరైన శిక్ష పడిందని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇదే అంశంపై శ్రీ రెడ్డి కూడా స్పందిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టింది. ముందుగా.. ఆ నలుగురు రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ అని తెలిపింది.

ఈ ఎన్‌కౌంటర్‌ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ జై కెసీఆర్ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఇంతటితో ఆగకుండా.. ఆ వెంటనే మరో పోస్ట్ పెట్టింది. ఎవరైతే పీకే లాగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారో వాళ్ళను కూడా ఎన్‌కౌంటర్‌ చేసేయాలి. ఏపీ పోలీసులకు ఇదే నా విన్నపం అంటూ సంచలన కామెంట్ చేసింది శ్రీ రెడ్డి.

శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ”పీకే పెళ్లిళ్లు చేసుకున్నాడు కానీ నీలాగా అది చేయడం లేదు కదా, నీ మెదడు నుంచీ ఇంత కన్నా గొప్ప స్పందన ఊహించలేములే” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -