కోలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బింధువుగా నిలిచింది సింగర్ సుచిత్ర. అయితే ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని ఆమె భర్త తెలిపారు. అయితే ఇలాంటి వాటిపై రకరకాల వివరణ ఇచ్చింది సుచిత్ర. తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఒకసారి, కాదని ఒక సారి.. ట్వీట్ పెట్టింది. వరసగా వివాదాస్పద ట్వీట్లు వస్తుండటంతో.. అకౌంట్ ను డిలీట్ చేసుకోవచ్చు కదా.. అని అడిగితే, ఆ అవసరం లేదని సుచిత్ర అంటోంది. హీరోయిన్ల పర్సనల్ ఫొటోలు ఆమె ట్విట్టర్ నుండి షేర్ అయ్యాయి. ఇందులో టాలీవుడ్ కి చెందిన త్రిష, రానాలు కూడా ఉన్నారు.
దీంతో తమిళ సినీ ప్రముఖులతో పాటు తెలుగు సినీ వర్గాల్లోని పెద్దలు కూడా ఎక్కడ తమ ఫొటోలు లీకవుతాయోనని తెగ టెక్షన్ పడిపోయారు. అయితే వారం రోజులుగా సుచీలీక్స్కి బ్రేక్ పడింది. సుచిత్ర విదేశాలు వెళ్లారని ప్రచారం సాగించినా.. లేదు సుచిత్ర కొందరు కిడ్నాప్ చేశారన్న వార్తలు కోలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి.
తమిళ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు సుచీని కిడ్నాప్ చేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. కాస్త సైలెన్స్ గా ఉన్న సుచీలీక్స్ ప్రకంపనాలు ఉన్నట్టుండి మళ్లీ మొదలయ్యాయి. త్రిష, ధనుష్, హన్సిక, చిన్మయి, అనిరుధ్, ఆండ్రియా, అనుయా భగత్, సంచిత పదుకొన్ల ప్రయివేటు ఫోటోల్ని, వీడియోల్ని సుచీలీక్స్ బట్టబయలు చేసి పరువు బజారుకీడ్చిన విషయం తెలిసింది. దీంతో కొందరు గ్రూపుగా ఏర్పడి సుచీని కిడ్నాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సుచిత్ర భర్త స్పందించాల్సిందే.
{youtube}kBzlCWvjeAc{/youtube}
Related