Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రభాస్‌పై సందీప్ భారీ ఆశలు!

- Advertisement -

యానిమల్ తర్వాత దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న చిత్రం స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సినిమా షూటింగ్ మొదలెకానుండగా పవర్ ప్యాక్డ్ ఈ యాక్షన్ మూవీపై అందరి అటెన్షన్ ఉంది.

రీసెంట్‌గా సలార్‌తో హిట్ కొట్టిన ప్రభాస్…ఆ సినిమాను మించి వసూళ్లను రాబడుతారని చెబుతున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో స్పిరిట్ తెరకెక్కుతుండగా తొలి రోజే రూ.150 కోట్లు వసూలు చేయడం ఖాయమని దర్శకుడు సందీప్ వంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రభాస్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ ఉందని చెబుతున్నారు. 2026 లో స్పిరిట్‌ ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ కల్కి ఏడీ2898లో నటిస్తుండగా తర్వలోనే ఇది రిలీజ్ కానుంది. అనంతరం సలార్ పార్ట్ 2, మారుతితో రాజా డిలక్స్‌ రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాల తర్వాత స్పిరిట్ ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -