Friday, May 3, 2024
- Advertisement -

రేటు పెంచేసిన త్రిష!

- Advertisement -

వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషనే ఎక్కువ. వయసుతో సంబంధం లేకుండా ఎప్పటికి ఎవర్ గ్రీన్ అని ఫీలవుతుంటారు. అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పాత్ర తక్కువే. అందం, అదృష్టం ఈ రెండు ఉంటేనే ఇండస్ట్రీలో రాణించవచ్చు. కానీ అది ఓ లిమిటెడ్ పీరియడ్ వరకే. కానీ ఈ భామకు మాత్రం వయసుతో సంబంధం లేదు. ఇప్పటికి ఎవర్ గ్రీన్ హీరోయినే.ఆమె అందం, అభినయం రెండు కలబోసిన త్రిష. మోడలింగ్ రంగం నుండి వచ్చి వెండి తెరపై తళుక్కుమన్న ఈ బ్యూటీ ఇప్పటికి ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.

రెండు దశాబ్దాలుగా సినీ కెరీర్‌ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..కమల్, మణిరత్నం సినిమాతో పాటు అజిత్ తో నటిస్తోంది.

ఇక తనకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిందట. ప్రస్తుతం సినిమాకు రూ. 2 కోట్లు తీసుకుంటుండగా దానిని ఏకంగా రూ. 3 కోట్లకు పెంచేసిందని టాక్ నడుస్తోంది. తెలుగులో చిరంజీవి,బాలయ్య సినిమాలతో పాటు రవితేజ హీరోగా నటిస్తున్నసినిమా కూడా ఉంది. ఇలా ఏజ్ మీద పడుతున్న తన గ్లామర్‌తో ఇప్పటికి మెప్పిస్తున్న త్రిష రెమ్యునరేషన్‌కి సంబంధించిన వార్త ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -