Wednesday, May 1, 2024
- Advertisement -

కొట్టుకుంటున్న హీరోయిన్ లు

- Advertisement -

ఒక సినిమా కోసం ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నువ్వా నేనా అని కొట్టుకుంటున్నారు. ఆ సినిమా కనుక నాకు పడితే ఇక బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవచ్చు అని ఆశగా ఆ సినిమా కోసం నువ్వా నేనా అనుకుంటున్నారు. అంతగా అందులో ఏం ఉందో తెలియాలి అంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.

బాలీవుడ్ తో పాటు టోటల్ ఇండియాను ఆకట్టుకున్న నవలల్లో 2015 బెస్ట్ అనిపించుకున్న నవల “హాల్ఫ్ గర్ల్ ఫ్రెండ్”. 3 ఇడియట్స్, 2 స్టేట్స్ లాంటి క్లాసిక్ కథలను రాసిన చేతన్ భగత్ రాసిన ఈ నవల యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ ఇయర్ టాప్ సెల్లింగ్ నవలలో ఒకటిగా నిలిచింది.

అలాంటి ఈ నవలను ఇప్పుడు ఆశిఖి 2, ఏక్ విలన్ దర్శకుడు మోహిత్ సూరి డైరెక్ట్ చేయబోతున్నాడు.కాగా ఇందులో హీరోయిన్ గా నటించడానికి ఎంతో మంది టాప్ హీరోయిన్లు ముందుకు రాగా మోహిత్ శ్రద్ధాకపూర్ మరియు పరిణితి చోప్రాలలో ఎవరో ఒకరిని తీసుకోవాలని అనుకున్నాడట.

కాని ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేయాలో వారికే వదిలేయడంతో నేను చేస్తా అంటే నేను చేస్తా అంటూ ఇద్దరు గొడవలు పడుతున్నారట. మరి ఆ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -