తెలుగు మూవీస్ లో బూతులు చాలా ఎక్కువైపోయాయని బాధపడుతున్నాడు స్టార్ కమెడియన్ వేణుమాధవ్. ఇక నుంచి బూతులున్న సినిమాలు చేయకూడదనే తాను సినిమాలకు దూరమైపోయానంటూ చిత్రమైన కారణం చెప్పాడు వేణుమాధవ్. తాను కూడా ఒక్కపుడు బూతు పాత్రలు చేశానని.. కానీ అవి తెలిసి తెలియక.. అవసరం కోసమో చేశానని.. అయితే ఒక స్థాయి వచ్చాక అలాంటి సినిమాలు చేయకుడదని ఆ తరహా సినిమాలకు దూరమైపోయానని వేణుమాధవ్ తెలిపాడు.
అయితే తాను సినిమాలు చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి అని చెప్పాడు. కొన్ని చిత్రాలు నేను వదులుకున్నా. ఇంకొందరు నన్ను అవాయిడ్ చేశారు. ఒకప్పుడు ఎలాంటి చిత్రలైనా చేసి ఉండొచ్చు. కానీ నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్లు సినిమాలు చూసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. నేను వాళ్ల ముందు తల దించుకోకూడదు. సో అందుకే ఇక బూతూ ఉన్న చిత్రాలు చేయకూడదనుకున్నా. అందుకే నా దగ్గరకి వచ్చిన అలాంటి సినిమాల్ని వదులకున్నా.
అయితే ఆ చిత్రలకు సంబంధించిన వాళ్లు వేరే వాళ్లకు ఇంకో రకంగా చెప్పారు. అందే విధంగా చాన్స్ లు ఇచ్చే వారు వెనక్కి వెళ్లిపోయారు. అయిన నేను హ్యాపీ. ఒకప్పుడు రేయింబవళ్లు పని చేశా. తినడానికి టైం లేకుండా పని చేశాను. రోజుకు ఆరు షిఫ్టులు పని చేసిన ఏకైక నటుడిని నేనేనేమో. ఇప్పుడు కూడా చిత్రాలు ఎంచుకునే విషయంలో నేను పెట్టుకున్న నియమాలు దాటట్లేదు. పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నా. పవన్ తో మరో సినిమా కూడా చేసే చాన్స్ కూడా ఉందని తెలిపాడు వేణుమాధవ్.
Related