Monday, May 20, 2024
- Advertisement -

ప్రత్యేక హోదా కోసం మ‌రో విద్యార్థి బ‌లి….దిగ్భాంతి వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోరుతూ మ‌రో టెన్త్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

మహేంద్ర రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చివుంటే అన్నకు ఉద్యోగం వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు. హోదా రాని కారణంగానే, తన అన్న నిరుద్యోగిగా ఉన్నాడని, దీంతో కుటుంబం గడవటం కష్టమైందని, ఇంట్లో వారికి భారం కాకూడదని నిర్ణయించుకున్నానని తన ఆవేదనను అక్షర రూపంలో లిఖించి, తనువు చాలించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మహేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ సంఘటన తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, తప్పక ప్రత్యేకహోదా సాధిస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి యువత సంయమనం పాటించాలని ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -