Thursday, April 25, 2024
- Advertisement -

నడి సముద్రంలో దారుణం..20 మంది వలసదారులు మృతి..!

- Advertisement -

మధ్యదరా సముద్రంలో పడవ మునిగిపోయి 20 మంది ఆఫ్రికన్​ వలసదారులు మృతి చెందారు. మరో 20 మంది వరకు ఆచూకీ గల్లంతైంది. ఐదుగురిని సురక్షితంగా రక్షించినట్లు టునీసియా అధికారులు తెలిపారు.టునీసియాలోని తీర ప్రాంత నగరం స్ఫాక్స్​కు సమీపంలో సముద్రంలో కోస్ట్​గార్డ్​ బృందాలు, స్థానిక మత్య్సకారులు మృతదేహాలను గుర్తించినట్లు.. ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మొహమ్మద్​ బెన్​ జెక్రీ తెలిపారు.

ప్రమాదం జరిగే సమయానికి బోటులో 50 మంది వరకు ఉంటారని తెలిసిందన్నారు. వారంతా స్మగ్లింగ్​ గూడ్స్​తో ఇటలీకి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు.ఆచూకీ గల్లంతైన వారి కోసం టునీసియా నావికాదళం గాలింపు చర్యలు చేపట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -