మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడా లేకుండా అందరిపైనా అత్యాచారానికి పాల్పడుతున్నారు మానవ మృగాలు. అభం, సుభం తెలియని చిన్నారులు అనే కనికరం లేకుండా దారుణానికి ఒడిగడుతున్న సంఘటనలో ప్రతీరోజు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది. చివరకు చిన్నారులకు స్కూల్లోకూడా భద్రత లేకుండా పోతోంది అనే ఆనికి నివర్శనమే ఈ దారున సంఘటన. కామంతో కళ్లు మూసుకుపోయిన పాఠశాల ఉద్యోగి.. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై స్కూల్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మరెక్కడో కాదు.. హైదరాబాద్లో టోలీచౌకీలోని ఆజాద్ ఇంటర్ నేషనల్ స్కూల్లో చోటు చేసుకుంది.
పాఠశాలలో యూకేజీ చదువుతున్న బాధిరాలికి చాక్లెట్ ఆశచూపి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. గత కొద్దిరోజులుగా చిన్నారి నీరసంగా కనబడటంతో తల్లిదండ్రులు నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు.
అత్యాచారానికి గురయ్యిందన్న విషయం తెలియడంతో చిన్నారి తల్లి, దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే స్కూల్ యాజమాన్యంలో ఓ వ్యక్తిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు పాఠశాల ప్రాంగణంలో ఉన్న స్కూల్ బస్సులపై రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. నిందుతున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.