Friday, March 29, 2024
- Advertisement -

పరువును రచ్చకీడ్చుకొంంటున్న పచ్చ చొక్కాలు!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అయితే… ప్రభుత్వాధికారులకు ఎనలేని స్వేచ్ఛ ఉంటుందని.. ఆయన అడ్మినిస్ట్రేషన్ అద్భుతం అని ఆ పార్టీ అభిమానులు గట్టిగా ప్రచారం చేసుకొంటూ ఉంటారు.

బాబు విజనరీ గొప్పదని అంటూ వారు ఇలా చెబుతూ ఉంటారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలు బాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ అర్థం అయ్యేలా చేస్తున్నాయి. ఒక ప్రభుత్వాధికారిణితో తెలుగుదేశం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొన్న మహిళా తహశీల్దార్ పై దాడి జరిగింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిణిపై ఎమ్మెల్యేనే దాడి చేశారు. కేవలం ఆమె మీదనే కాకుండా.. డ్వాక్రా మహిళలపై కూడా దాడులు జరిగాయి. మరి ఒక ప్రజాప్రతిధిని.. అధికార పార్టీ ముఖ్యుడు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు జడిసి.. చివరకు విప్ చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు.

అయితే ఎమ్మెల్యేపైనే కాదు.. ఎమ్ ఆర్వోపై కూడా కేసులు పెట్టడమే ఇక్కడ విడ్డూరం. ఎమ్మెల్యే ఆమెపై దాడి చేస్తే.. మళ్లీ ఆమెపై కేసు పెట్టడం ఏమిటి? అంటే.. ఎమ్ ఆర్వో ఆధ్వర్యంలో తమపై దాడి జరిగిందని.. అంటూ డ్వాక్రా మహిళలు ఫిర్యాదు చేశారట. దీంతో పోలీసులు ప్రభుత్వాధికారిణిపై కేసు నమోదు చేశారు. ఈ విధంగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్టుగానే చేసి.. ప్రభుత్వ అధికారిణిపై కూడా కేసు నమోదు చేశారు. మరి ఇదేదో ప్రతీకారేచ్ఛతో చేసినట్టుగా ఉంది కానీ.. మరోటి కాదు. ఇలాంటి వ్యవహారాలతో పచ్చ చొక్కాలు పరువు తీసుకొంటున్నట్టుగా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -