Thursday, May 16, 2024
- Advertisement -

చాన్స్ మిస్ చేసుకుంటున్న వైసిపి?

- Advertisement -

ఒకరు కాదు. .ఒకేసారి ఇద్దరు తెలుగుదేశం నేతలు వివాదస్పమైన రీతిలో వార్తల్లోకి వచ్చారు. ఇంకా రేవంత్ రెడ్డి వ్యవహారం ఒక కొలిక్కిరాకముందే మరోవైపు పీతల సుజాత వ్యవహారం వార్తల్లో నలుగుతోంది.

ఆమె ఇంటి ఆవరణలో ఏకంగా పదిలక్షల రూపాయల డబ్బు పట్టుబడటం..

దానిపై సరైన వివరణ లేకపోవడంతో అనేక అనుమానాలకు తావిచ్చినట్టుగా అవుతోంది.

డబ్బు విషయంలో చంద్రబాబు మంత్రిగారు రకారకాల వెర్షన్లను వినిపిస్తున్నారు. ఆ డబ్బు ఎవరో మతి స్థిమితం లేని వ్యక్తి తన ఇంటి దగ్గర వదిలిపెట్టిపోయినట్టుగా ఆమె ఒకసారి చెప్పారు. మరోసారేమో శుభలేఖ ఇవ్వడానికి తన నివాసానికి వచ్చిన ఒక వ్యక్తి డబ్బు అక్కడ పెట్టి మరిచిపోయారని ఆమె చెప్పుకొచ్చారు. మరి మంత్రిగారు ఇలా భిన్నమైన కథనాలను చెబుతున్నారు. అదేంటి అంటే.. ఇదంతా కుట్ర అని.. తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని ఆమె అంటున్నారు.

మరి చంద్రబాబు, మంత్రిగారు ఈ డబ్బుపై సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారని మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది. ఇది వరకూ కూడా పీతల సుజాత విషయంలో కొన్ని ఆరోపణలున్నాయి. ఆమె ఒక వడ్డాణాన్ని గిఫ్ట్ గాతీసుకొన్నట్టు వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు ఇదో వివాదం. ఇలా వరసగా తెలుగుదేశం నేతలు డబ్బు సంబంధ వివాదాల్లో ఇరుక్కొంటూ ఉండటం తెలుగుదేశంపార్టీ ఇమేజ్‌కు దెబ్బే. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నోరెత్తితే.. నీతి, నిజాయతీ అంటారు. ఆ పార్టీ నేతలేమో ఇలా ఇరుక్కొంటున్నారు. ఇలాంటి పరిణామాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశం. కానీ వైసిపి వీటిని సరిగ్గా ప్రజలల్లోకి తీసుకు వెళ్ళటంలో విఫలం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -