Saturday, April 27, 2024
- Advertisement -

బాధితులను పరామర్శించిన చంద్రబాబు…

- Advertisement -

ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు నాయుడు కృష్ణానదిలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన సంఘ‌ట‌నా స్థలాన్ని మంత్రి అఖిల ప్రియ‌తో క‌ల‌సి సంద‌ర్శించారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నేది అక్క‌డ‌నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వివరాలు తెలుసుకొని, సంఘటన గురించి తెలియగానే స్పందించిన సైదులు, నడికుదురు పిచ్చయ్య, శివయ్యలతో చంద్రబాబు మాట్లాడారు.

ప్రమాదానికి దారితీసిన కారణాలను, బోటు నిర్వాహకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకపోయినా బోటు తిరుగుతుంటే చేస్తున్నారంటూ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. మృతుల వివరాలు, చికిత్స తీసుకుంటున్న వారి వివరాలతో పాటు గల్లంతైన వారికోసం జరుగుతున్న గాలింపు చర్యలపై ఆరా తీసారు. అయితె మీడియాతో మాట్లాడ‌కుండా నేరుగా చంద్రబాబు విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రికి చేరుకున్నారు.

విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పడవ ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో ఆయన మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న వైద్యసాయంపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -