- Advertisement -
దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్లో ఓటర్లను ఆకర్శించుకొనేందుకు అన్ని వర్గాల వారికి భారీగా గానే తాయిలాలు ప్రకటించింది. అయితే ఏపీకీ మాత్రం మరో సారి మొండిచేయి చూపింది. సుమారుగా రెండున్నర్రగంటల బడ్జెట్లో అసలు ఏపీ ఊసె ప్రస్తావించలేదు. వైసీపీ, టీడీపీ ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్న విభజన హామీలు కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరికీ కేటాయింపులు, విశాఖ రైల్వే జోన్, రాష్ట్రానికి పన్నుల్లో రాయితీలు, పోలవరం ప్రాజెక్ట్కు నిధులు ఇలాంటి వాటిలో వేటికి పీయూష్ గోయెల్ పట్టించుకోలేదు.
బడ్జెట్పై అధికార, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.