- Advertisement -
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర బోటు ప్రమాద ఘటన జరిగినప్పటినుంచి దగ్గరుండి విశ్రాంతి లేకుండా సహాయక కార్యక్రమాలుపర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రిలో ఉంటూ రోజూ ప్రమాద స్థలానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ను దగ్గరుండి చూస్తున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం అవంతి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బధ్రతా సిబ్బంది దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెల్లారు. ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు.