టీడీపీ నాయకులకు దళితులను కించపరడం మామూలయిపోయింది. చంద్రబాబు నుంచి మొదలు కొని మంత్రులు ఈ మధ్య కాలంలో దళితులపైఅనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలసిందే. తాజాగా ఆర్టీసీ ఛైర్మెన్ వర్లారమాయ్య దళితుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
మచిలీపట్నం బస్టాండులో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని కులంపేరుతో దూషించాడు. బస్సులో పాటలు వింటున్న ప్రయాణికుడిని కులం పేరు అడగ్గా.. ఎస్సీ అని యువకుడు సమాధానం చెప్పాడు. ఎస్సీ అంటే..మాలనా, మాదిగనా వివరంగా చెప్పాలని రాయమ్య అడిగాడు. మాదిగ అని చెప్పిన యువకుడిని ఉద్దేశిస్తూ.. మాదిగలు అసలు చదువరంటూ.. కులం పేరుతో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. వర్లరామయ్య వ్యాఖ్యలతో పక్కనే ఉన్న అధికారులు, నేతలు ఖంగుతిన్నారు.
రామయ్య వ్యాఖ్యలతో ఆర్టీసీ అధికారులు, బస్సులోని ఇతర ప్రయాణీకులు విస్తుపోయారు. గత వారంలో ప్రయాణీకులతో డ్రైవర్లు, కండెక్టర్లు మర్యాదగా ప్రవర్తించాలని, మర్యాద వారోత్సవాలు నిర్వహించారు. ఇంతలో సాక్ష్యాత్తు ఆర్టీసీ చైర్మన్ దళిత యువకుడిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.