- Advertisement -
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో , నందమూరి బాలయ్య భార్య వసుందర దగ్గర పెద్ద నోట్లు ఉన్నాయి అనే న్యూస్ ఇప్పుడు బాగా ఎక్కువగా వినిపిస్తోంది. భారీగా పెద్ద నోట్లని తీసుకుని ఆమె తన వాహనం లో ప్రయాణం చేస్తున్నారు అనే వార్త నడుస్తోంది .
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకున్న ఆమె కి రేణి గుంట ఎయిర్పోర్ట్ లో షాక్ తగిలింది. సీఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ చెక్ సమయంలో.. ఆమె పేరుతో బుక్ చేసిన బ్యాగేజ్ లో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు కనిపించడంతో.. ఐటీ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కానీ ఆమె తనదగ్గర ఉన్న మొత్తానికీ లెక్క చూపించారు. ధృవీకరణ సమయంలో ఆమె చాలా కాన్ఫిడెంట్ గా కనిపించరు. పాత కరన్సీ నోట్లని శ్రీవారి సన్నిధిలో వెయ్యడం కోసం ఆమె వచ్చినట్టుగా కొందరు చెబుతున్నారు.