- Advertisement -
బిహార్లో కూటమి మధ్య విబేధాలు ముదురి పాకాన పడటంతో సీఎం నితీశ్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యవహారంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.సద్దు మనగకపోగా అవి తారాస్థాయికి చేరడంతో సీఎం తీసుకున్న నిర్నయం సంచలనంగా మారింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ చెబుతున్న నేపథ్యంలో.. తన కొడుకు రాజీనామా చేయడని, దమ్ముంటే తమ పార్టీతో బంధం తెంచుకోవాలని లాలూ ప్రసాద్ సవాల్ విసిరారు.దీంతో తన పదవికి రాజీనామ చేశారు.