Saturday, May 4, 2024
- Advertisement -

ప్రత్యేక హోదాపై బాబును విలన్ గా చేస్తున్న బీజేపీ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం చేతులు ఎత్తేసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు. దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదాను ఇచ్చే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేయడంతో ఏపీకి ప్రత్యేక హోదా కూడా కలే అనుకోవాల్సి వస్తోందిప్పుడు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ ఏపీకి మోసం చేస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

తాజాగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంలో తాము విలన్లం కాదని స్పష్టం చేస్తున్నారు. తమ గురించి తెలుగుదేశం పార్టీ దుష్ఫ్రచారం చేస్తోందని వారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మిత్రధర్మం పాటించడం లేదని.. ప్రత్యేక హోదా విషయంలో తమను ప్రజల ముందు చెడుగా చూపడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని కమలనాథులు అంటున్నారు.

ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి.. చంద్రబాబు నాయుడు దుబారా చేస్తున్నాడని.. కోట్లకు కోట్లు అనవసరంగా ఖర్చు పెడుతున్నాడని.. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కేంద్రంను నిందిస్తున్నాడని.. ఇదేంటి? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బాబు తీరు సరికాదని వారు అంటున్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ తెలుగుదేశం అధినేతను విలన్ గా  చూపే ప్రయత్నం చేస్తోంది. మరి దీనిపై తెలుగుదేశం ఎలా స్పందిస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -