Sunday, May 12, 2024
- Advertisement -

ఐటీ దాడులు ఎఫెక్ట్ …మంత్రుల‌తో బాబు మంత‌నాలు..కింక‌ర్త‌వ్యం..?

- Advertisement -

ఏపీలో టీడీపీ నేత‌లే టార్గెట్‌గా ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రి కార్యాలాయ‌ల్లో సోదాలు నిర్వ‌హిస్తారో న‌నే టెన్స‌న్ ప‌చ్చ పార్టీనేత‌ల్లో ప‌ట్టుకుంది. టీడీపీ నేత బీద మస్తాన్ రావు సహా పలువురు నేతలకు సంబంధించిన కంపెనీల్లో ఈ రోజు తనిఖీలు కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో సీఎం చంద్ర‌బాబు అత్య‌వ‌స‌రంగా అందుబాటులో ఉన్న మంత్రుల‌తో అమ‌రావ‌తిలో స‌మావేశం నిర్వ‌హించారు.

చంద్రబాబు లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడం, ఎన్నికలకు ముందు అధికార పార్టీ నేతలు, వారి కంపెనీలపై ఐటీ శాఖ దాడులు చేయడాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఐటీ దాడులు చోటు చేసుకొంటాయా… ఈ దాడుల వెనుక రాజకీయ పరమైన కుట్రలు ఏమైనా దాగున్నాయా…. సాధారణ పరిస్థితుల్లోనే ఈ దాడులు జరిగాయా అనే విషయమై కూడ చర్చించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -