Friday, May 3, 2024
- Advertisement -

‘సాక్షి’ని తప్ప.. అందరినీ బాబు మ్యానేజ్ చేశాడా..!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే మాటలు కాదు.. ఆయనకు ఉన్న సత్తా అంతా ఇంతా కాదు.  ఆ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసుకోవడంలో అయినా బాబుకు ఉన్న ప్రతిభ అంతా ఇంతా కాదు.

ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. బాబు ప్రతిసారీ ఈ విషయంలో తన ప్రతిభను ప్రదర్శించుకొంటూ ఉన్నాడు. తాజాగా అది మరోసారి జరిగంది. పుష్కరాల్లో జరిగిన దుర్ఘటన విషయంలో బాబుగారి ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో మొత్తం మీడియాను మ్యానేజ్ చేశారు చంద్రబాబు.

మంగళవారం దుర్ఘటన జరిగిన కొంతసేపుఅయితే దానిపై మీడియాలో కథనాలు మార్మోగాయి. అన్ని చానళ్లూ  గోదావరి పుష్కరాల్లో జరిగన దుర్ఘటన గురించే కథనాలు ఇచ్చాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టం అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో… ఇదే విషయం నాల్లోకి వెళితే తమకు తీవ్రమైన చెడ్డపేరు తప్పదని బాబు అండ్ బ్యాచ్ గ్రహించింది. దీంతో మీడియా మ్యానేజ్ మెంట్ కు దిగినట్టుగా సమాచారం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. అన్ని చానళ్లనూ దారి తెచ్చుకొన్నట్టుగా తెలుస్తోంది.

పెద్ద ఎత్తున జరిగిన పుష్కరాల్లో అంత దారుణం జరిగినా.. మధ్యాహ్నానానికి ఒక్క చానళ్లో కూడా ఆ దుర్ఘటన వార్తలు కనిపించలేదు. పై పెచ్చూ కొన్ని చానళ్లు అయితే బాబును వెనకేసుకొచ్చాయి. ప్రభుత్వాన్ని ఏం అనడానికి వీలు లేదని తీర్మానించాయి. జరిగిన దారుణంలో ప్రభుత్వం వైఫల్యం ఏమీ లేనట్టుగా.. ప్రభుత్వాన్ని నిందించడం తప్పు.. అని ఆ చానళ్లు తీర్పునిచ్చాయి. అలాగే ఇంత దుర్ఘటన గురించి జాతీయ మీడియాలో సింగిల్ కాలమ్ వార్త కూడా రాలేదు. ఇదంతా బాబుగారి మీడియా మ్యానేజ్ మెంట్ ఫలితామేనని తెలుస్తోంది. ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన ‘సాక్షి’ టీవీని తప్ప బాబు తెలుగు మీడియాను అంతా మ్యానేజ్ చేశాడని.. బాబుకు సహజసిద్ధంగానే సపోర్ట్ చేసే టీవీ చానళ్లు అయితే బాబును వెనకేసుకువచ్చేలా కథనాలు ఇచ్చాయని తెలుగు వారందరికీ అర్థం అయ్యింది. ఈ విధమైన బాబుగారి సత్తాను చూసి అందరూ ఔరా అనుకొన్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -