Saturday, May 4, 2024
- Advertisement -

చంద్రబాబు మోసగాడు..ముద్దరబోయిన!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. నూజివీడు ఇంఛార్జీగా పార్థసారధిని ప్రకటించడంపై మండిపడ్డారు వెంకటేశ్వరరావు. వైసీపీ నుండి పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారథి. ఈసారి పెనమలూరు టికెట్ ఆయనకు దక్కలేదు. దీంతో టీడీపీ తరపున నూజివీడు నుంచి బరిలోకి దిగనున్నారు.

తనకు కాకుండా పార్థసారథికి టికెట్ ఇస్తారనే సమాచారం అందడంతో పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు మోసం చేశారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. జగన్‌ని కలవడంతో వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది.

వాస్తవానికి పార్థసారథి టీడీపీలో చేరడంతోనే ఆయనకు నూజివీడు టికెట్ కన్ఫామ్ అయిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ముద్దరబోయినను బుజ్జగించేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. కానీ తొలి నుండి పనిచేస్తున్న తనను కాదని పార్థసారథికి టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -