Tuesday, May 7, 2024
- Advertisement -

స్కూల్లో ఉపాధ్యాయుడి రాసలీలు….చివరకు చిక్కాడిలా

- Advertisement -

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు పక్క దారి పట్టారు. పాఠశాలలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. స్కూల్లోనె రాసలీలలు సాగిస్తున్న ఉపాధ్యాయుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు అతనికి దేహ శుద్ది చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెల్తే…తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా పుదుచత్రం సమీపంలోని ఎస్‌ ఉడుంబం అనే గ్రామం ఉంది. ఇక్కడ ఎలిమింటరీ పాఠశాలకు హెడ్‌మాస్టర్‌గా జయరాజ్, ఉపాధ్యాయుడు శరవణన్‌ ఉ న్నారు. శరవణ్ కు అదే పాఠశాల ప్రాంగణంలో అంగన్ వాడీ కేంద్రం ఆర్గనైజర్ గా పనిచేస్తున్న జయంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరు గత కొన్ని నెలలుగా పాఠశాల మరుగుదొడ్డిలో కలుసుకుని రాసలీలలు నెరపుతున్నారు.దీన్ని గమనించిన కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పారు.

దీంతో ఆవేశంతో ఉగిపోయిన గ్రామస్తులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకొని శరవణన్ ను పట్టుకుని మహిళలు చెప్పులు, చీపురలతో చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై స్పందించిన హెడ్ మాస్టర్ గత రెండు నెలల క్రితం ఇదే విధంగా శరవణన్‌ ఒక మహిళతో పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్నట్టు తనకు సమాచారం అందిందన్నారు. అయితే తాను అక్కడికి వెళ్లే సరికి మరుగుదొడ్డికి తాళాలు వేసి ఉన్నాయని, అయినప్పటికీ తాము ఆ తాళాలు తీసి లోపలికి వెళ్లి చూడగా మహిళ ఉన్నట్టు తాము చూశామన్నారు. అదేసమయంలో శరవణ్ ను తాము హెచ్చరించి పంపించేశామని తర్వాత ఎలాంటి అకృత్యాలు పాఠశాలలో జరగలేదని తెలిపారు.ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో త్వరలోనే విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -