పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్కు, పవన్ ఫ్యాన్స్కు మధ్య పెద్ద రభసే జరిగింది.
ఇరువురు ఫ్యాన్స్ చితకొట్టుకున్నారట. పోలీసులు వచ్చి ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో లాఠీ చార్జీ చేసి గొడవను అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇలా జరగడానికి కారణం ఏంటంటే..
పవన్ బర్త్డే రోజు భీమవరంలో పవన్ ప్లెక్సీలను చింపేశారు. ఇది ఎవరు చేశారో కరెక్ట్గా తెలీదు. కానీ అది చేసింది ప్రభాస్ ఫ్యాన్సే అని వాళ్ళ ఇంటి కెళ్ళి పవన్ ఫ్యాన్స్ గొడవ పెట్టుకోవడంతో ఇరువురు బాగా దెబ్బలాడుకున్నారని సమాచారం. ఇప్పుడు భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఆగ్రహంతో ఊగిపోతున్నారట.
ఈ వ్యవహారంపై పోలీసులు ఇరువురిపై కేసులు పెట్టి విచారిస్తున్నారు. రోడ్డు ప్రక్కనున్న ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినందుకు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు భీమవరంలో శుక్రవారం, శనివారం 144 సెక్షన్ విధించారు.