Saturday, April 27, 2024
- Advertisement -

4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఇదో చరిత్ర…జగన్

- Advertisement -

దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత ఏపీదేనని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.దాదాపు లక్షన్నర మందికి శాశ్వత ఉద్యోగాలు రావడం ఓ చరిత్ర. దేశ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం. అని జగన్ వ్యాఖ్యానించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ నియామకపత్రాలను అందించారు.

గ్రామ వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ఉద్యోగులు నిజాయతీగా, లంచాలు తీసుకోకుండా పని చేయాలని అన్నారు. దీన్ని ఉద్యోగంలా కాకుండా, బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు.72 గంటల్లో ఫిర్యాదులను పరిష్కరించడమే సచివాలయ ఉద్యోగుల బాధ్యత అని తెలిపారు. తాను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని చెప్పారు

ప్రతి గ్రామానికి 12 కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగాం. 4 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సరికొత్త రికార్డ్. సొంత మండలంలో పనిచేసే అవకాశం గొప్ప అదృష్టం. ఆ అవకాశాన్ని దక్కించుకున్న మీరంతా మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలాన్నారు. అధికారం చలాయించడం కోసం ఉద్యోగం కాదు.. ప్రజల కోసం పనిచేసే బాధ్యతగా ఉండాలి. రేషన్ కార్డు, పెన్షన్ కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి. మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరిట ప్రజలను దోచుకుంది. ఇక నుంచి అలాంటి పరిస్థితులు ఉండకూదని చెప్పారు.గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 500 సేవలు అందించాలి. ప్రతి గ్రామ వాలంటీర్‌కు స్మార్ట్‌ఫోన్ ఇస్తాం. డిసెంబర్ నాటికి గ్రామ సచివాలయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని’ జగన్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -